ప్రస్తుతం మనం ఉన్న పరిస్తితిలో రాష్ట్ర విభజన కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి సంబందించినది కాదు. కెసిఆర్ గారు మరియు మిగితా నాయకులు 1956 నుంచి జరుగుతున్న తెలంగాణా పోరాటము గురించి చెబుతున్నారు ! ఈ పోరాటము ఎంత వరకు ఎవరు నడిపించారు అన్నది ముఖ్యము. ఈ యభైయ్ ఏళ్ళు తెలంగాణా కి ఏమి చెయ్యని తెలంగాణా నాయకులు రేపు కొత్త రాష్ట్రము ఏర్పడినాక ఏమి చేస్తారు?
వీరు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్నారు, రేపు రాష్ట్రము వొచ్చినాక ఎటువంటి విధానము పాటిస్తారో స్పష్టం చెయ్యాలి. తెలంగాణా ప్రాంతం వెనకపడి ఉన్నది అని అనటం లో ఏ మాత్రం సంకోచం లేదు. కానీ ఎందుకు వెనకపడింది, రేపు కొత్త రాష్ట్రముతో పాటు వోచే కొత్త సమస్యలు, ఇంతక ముందు ఉన్న పాత సమస్యలు ఎలా అధిగమించాలో మన కెసిఆర్ గారు తెలంగాణా ప్రజలకి వివరించటం లేదు !
ముఖ్యంగా కొత్త రాష్ట్రము ఏర్పడిన వెంటనే చాలా అయోమయం ఏర్పడనుంది, పరిపాలనా విధంగా కానీ, ఆర్ధికంగా కానీ, అతి పెద్ద సమస్య అయిన నక్సల్యట్ల సమస్య కానీ, ఇలా చాలా సమస్యలు రాష్ట్ర కొత్త నాయకులు అధిగమించాలి.
మరి వీటికి సంధానం ఏంటో?
0 comments:
Post a Comment