ప్రస్తుతం మనం ఉన్న పరిస్తితిలో రాష్ట్ర విభజన కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి సంబందించినది కాదు. కెసిఆర్ గారు మరియు మిగితా నాయకులు 1956 నుంచి జరుగుతున్న తెలంగాణా పోరాటము గురించి చెబుతున్నారు ! ఈ పోరాటము ఎంత వరకు ఎవరు నడిపించారు అన్నది ముఖ్యము. ఈ యభైయ్ ఏళ్ళు తెలంగాణా కి ఏమి చెయ్యని తెలంగాణా నాయకులు రేపు కొత్త రాష్ట్రము ఏర్పడినాక ఏమి చేస్తారు?
వీరు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్నారు, రేపు రాష్ట్రము వొచ్చినాక ఎటువంటి విధానము పాటిస్తారో స్పష్టం చెయ్యాలి. తెలంగాణా ప్రాంతం వెనకపడి ఉన్నది అని అనటం లో ఏ మాత్రం సంకోచం లేదు. కానీ ఎందుకు వెనకపడింది, రేపు కొత్త రాష్ట్రముతో పాటు వోచే కొత్త సమస్యలు, ఇంతక ముందు ఉన్న పాత సమస్యలు ఎలా అధిగమించాలో మన కెసిఆర్ గారు తెలంగాణా ప్రజలకి వివరించటం లేదు !
ముఖ్యంగా కొత్త రాష్ట్రము ఏర్పడిన వెంటనే చాలా అయోమయం ఏర్పడనుంది, పరిపాలనా విధంగా కానీ, ఆర్ధికంగా కానీ, అతి పెద్ద సమస్య అయిన నక్సల్యట్ల సమస్య కానీ, ఇలా చాలా సమస్యలు రాష్ట్ర కొత్త నాయకులు అధిగమించాలి.
మరి వీటికి సంధానం ఏంటో?
Sunday, December 20, 2009
Friday, December 11, 2009
రాష్ట్ర విభజన !
సమైఖ్య ఆంధ్ర ?
లేక .... తెలంగాణా + రాయలసీమ + కోస్తా
నేను ఎక్కడి వాడిని? ఈ ప్రశ్న చాలా మంది ఈ తరం యువకులలో ఉంది. వాళ్ళ చిన్న తనం లోనే తల్లి దండ్రులు ఉద్యోగ రిత్యా లేక వ్యాపార నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ నగరము రాజధానిగా ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలవారు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఎవరో డిల్లీలో కూర్చొని ఇంకెవరో ప్రొద్దుపోని నాయకుడు అన్నం తినటం మానేసాడు అని ఒక ప్రసాంతమైన రాష్ట్రాన్ని విభజించటానికి వెనుకాడలేదు !
ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సారి రాష్ట్ర ప్రజల మనోగతం తెలుసు కోవాలిసింది. అదే కనక జరిగి ఉంటే ఈరోజు ఇంట మంది ప్రజా నాయకులూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా రాజీనామా చేసేవారు కాదు.
ఈ ఘటన రాబోవు ప్రభుత్వాలకు, తరాలకు ఒక గుణపాటం కావలి !
లేక .... తెలంగాణా + రాయలసీమ + కోస్తా
నేను ఎక్కడి వాడిని? ఈ ప్రశ్న చాలా మంది ఈ తరం యువకులలో ఉంది. వాళ్ళ చిన్న తనం లోనే తల్లి దండ్రులు ఉద్యోగ రిత్యా లేక వ్యాపార నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ నగరము రాజధానిగా ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలవారు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఎవరో డిల్లీలో కూర్చొని ఇంకెవరో ప్రొద్దుపోని నాయకుడు అన్నం తినటం మానేసాడు అని ఒక ప్రసాంతమైన రాష్ట్రాన్ని విభజించటానికి వెనుకాడలేదు !
ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సారి రాష్ట్ర ప్రజల మనోగతం తెలుసు కోవాలిసింది. అదే కనక జరిగి ఉంటే ఈరోజు ఇంట మంది ప్రజా నాయకులూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా రాజీనామా చేసేవారు కాదు.
ఈ ఘటన రాబోవు ప్రభుత్వాలకు, తరాలకు ఒక గుణపాటం కావలి !
Subscribe to:
Posts (Atom)